ఏవి హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

566చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని రహమానియ మస్జిదులో మంగళవారం ఏవి హెల్ప్ లైన్ నాయకులు కృష్ణ మోహన్, మస్తాన్, నాగ రాజు, హుస్సేన్, జమాల్, శ్రీకాంత్ తదితరులు కలిసి రంజాన్ ఉపవాస దారులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉపవాసదారులకు వారు విందును వడ్డించారు. వారు మాట్లాడుతూ ఏవీ సుబ్బారెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా చేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్