ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు కరిష్మా, కాలేషా(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7న సాయంత్రం ఇరుగాళమ్మ ఆలయం వద్ద కాలేషా ఆడుకుంటూ అక్కడ ఉన్న ఓ పెట్రోల్ బాటిల్ను చూసి కూల్డ్రింక్ అనుకొని తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.