మంత్రాలయం మండలం మాధవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రాలయం మండలంలో ఉన్న వివిధ శాఖల సచివాలయ ఉద్యోగులంతా మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డిని మరియు వారి సోదరులు ఎన్. రఘునాథ్ రెడ్డిని, ఎన్. రామకృష్ణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాల వేసి సత్కరించారు. మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు వీలైనంత త్వరగా తీర్చే విధంగా అధికారులు పనులు చేయాలని అధికారులకు సూచించారు.