టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

62చూసినవారు
టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం
నంద్యాల పార్లమెంటు పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. ఐదుగురుని సలహా కమిటీ సభ్యులుగా నియమించారు. పాములపాడు కురవ రమేష్, పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస్ యాదవ్, కల్లూరు మధు, ఆత్మకూరు గౌస్ రాజం, నూనెపల్లె పేరు మాల విజయ్ కుమార్ లను బిఎస్ఎన్ఎల్ (టెలికాం) సంస్థ కమిటీ సభ్యులుగా నియమించినట్లు, కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా నియమించేందుకు సహకరించిన నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్