వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట

57చూసినవారు
వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట
నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్కులో మాల మహానాడు అధ్యక్షులు ఏసీ నగేష్ ఆధ్వర్యంలో.. శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాలకు నంద్యాల జిల్లా నాయకులు సాంబశివుడు ఆయన సహచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు కొట్టి వేసేంతవరకు ఉద్యమ బాటకు సిద్ధం అవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్