పాణ్యం: కాల్వబుగ్గ ఈవో అవినీతి విచారణను బహిర్గతం చేయాలి

75చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలోని కాలబుగ్గ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రసాద్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేసిన అంశాలను బహిర్గతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్నాథం డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులో వారు మాట్లాడారు. కాల్వబుగ్గ రామేశ్వర దేవస్థానంలో రూ. 1. 30 కోట్లు డబ్బును నిబంధనలకు వ్యతిరేకంగా ఈవో ప్రసాద్ సొంత అకౌంటుకు మళ్లించుకున్నారని, విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్