భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి: ఈవో పెద్దిరాజు

82చూసినవారు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి: ఈవో పెద్దిరాజు
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. ఆదివారం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేవస్థానం డార్మిటరీలో భక్తులకు ఉచిత వసతి కల్పించాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఇళ్లల్లోకి నీరు చేరి వంటలు చేసుకోలేని వారికి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ చేయాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్