ఆగి ఉన్న కారును సిమెంటు ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పలువురు సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. సంగం నుంచి పామూరు కి వెళుతున్న కారు కొండ దిగుతున్న సమయంలో గేదలు అడ్డుగా రావడంతో కారును రోడ్డు పక్కకు ఆపారు. అదే సమయంలో వేగంగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.