మర్రిపాడులో రెండు లారీలు ఢీ.. లారీ డ్రైవర్ మృతి

5565చూసినవారు
మర్రిపాడు మండలంలోని నందవరం సమీపంలో శనివారం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు నుంచి బద్వేల్ వైపు వెళుతున్న బొగ్గు లారీ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొగ్గు లారీలో ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

సంబంధిత పోస్ట్