మర్రిపాడు మండలంలోని రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జమ్మలమడుగు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆవులు ఒక్కసారిగా గుంపులుగా అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న ఆవుల యజమాని సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు.