పాలకులు మారినప్పటికీ మా పరిస్థితి మారడం లేదు

67చూసినవారు
పాలకులు మారినప్పటికీ మా పరిస్థితి మారడం లేదు
ఓటు వేయాలంటే రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. పాలకులు మారినప్పటికీ మా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని కందుకూరు మండలం పరిధిలోని శామీర పాలెం వాసులు ఆవేదన చెందారు. తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు గురువారం వినతిపత్రం అందజేశారు. వృద్ధులు, ఆడవాళ్లు ఓటు వేసే ప్రతిసారి నడిచి వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్