కందుకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతా

64చూసినవారు
కందుకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతా
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కందుకూరు మండలంలోని పందలపాడు పంచాయతీలో 10. 06 లక్ష రూపాయలు నిధులతో, కోవూరు పంచాయతీలో 24. 45 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్ల నిర్మాణానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్