మాలకొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి

62చూసినవారు
మాలకొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి
వలేటివారిపాలెం మండలంలోని మాలకొండలో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.
అనంతరం ఆలయ ఈవో తో ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్