ఉలవపాడు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చాకిచెర్ల పంచాయతీ సర్పంచ్ వీరమల్లు విజయమ్మ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతోపాటు పలువురు టిడిపిలో చేరారు. కూటమి విధానాలు నచ్చడంతో ప్రతి ఒక్కరు టిడిపిలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.