ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తృటిలో బయటపడ్డ ప్రయాణికులు

5338చూసినవారు
ఉలవపాడు మండలం చాగల్లు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున ట్రావెల్స్ బస్సు దగ్గమైంది. శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు చెన్నై నుండి హైదరాబాద్ వెళుతుండగా చాగొల్లు వద్దకు రాగానే ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులంతా బస్సు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్