దగదర్తి మండలం, కౌరుగుంట పంచాయతీ, సున్నపుబట్టీ గ్రామం, ఎస్ టి గిరిజన కాలనీ నందు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నేత మాలేపాటి రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పార్టీలో చేరిన కుటుంబాలకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన తాను చేస్తానని హామీ ఇచ్చారు. తదుపరి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.