కావలిలో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!

76చూసినవారు
కావలిలో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందింది. 2014, 19 లో వైసీపీ నుండి గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి నుంచి కావ్య కృష్ణా రెడ్డి, కాంగ్రెస్ నుండి పొదలకూరి కళ్యాణ్ తమదే గెలుపంటూన్నారు. స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్