బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారి కెనరా బ్యాంకు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు అధికంగా పేరుకుపోయాయి. ఇలా పిచ్చి మొక్కలు పేరుకుపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.