కోవూరు మండలంలోని గుమ్మల దిబ్బలో బుధవారం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సతీమణి సునంద రెడ్డి, కుమార్తె నిహారిక రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవర గిరి శ్రీలత, ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, వైసిపి నేతలు పాల్గొన్నారు.