కొడవలూరు మండలంలోని ఎల్లాయ పాలెం గ్రామంలో ఆదివారం ఉదయం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.