ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసన

74చూసినవారు
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసన
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జగన్ చేపట్టిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఇందుకూరుపేట మండల కార్యాలయం వద్ద విలేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై దాడులు చేపట్టడానికేనా సిద్ధం కార్యక్రమం అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై వెంటనే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్