కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బుచ్చిరెడ్డిపాలెం కి చెందిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో బుల్లెట్ వాహనంపై రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి కాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.