ప్రభాకర్ రెడ్డి ఎంతో ప్రజా సేవ చేస్తూనే ఉన్నారు - బాలకృష్ణ

63చూసినవారు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో నందమూరి బాలకృష్ణని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివసులు రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి ఎంతో ప్రజా సేవ చేస్తూనే ఉన్నారని ఉదయగిరిలో ఫ్లోరైడ్ బాధితులకి సురక్షిత తాగు నీరు సుమారు 150 మినరల్ వాటర్ ప్లాంట్ లు మొత్తం జిల్లాలోనే ఏర్పాటు చేశారని అలాగే ఉచిత విద్యను అందిస్తున్నారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్