తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం మాచవరం గ్రామంలో శనివారం వైకాపాకు చెందిన రెండు వర్గాల నాయకుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరికి రక్త గాయాలు అయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్క దిద్దారు. దీంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచారానికి వెళ్లకుండా గ్రామ నుంచి వెనుదిరిగారు.