పిండిపాలెంలో జోరుగా వేనాటి రామచంద్రారెడ్డి ప్రచారం

57చూసినవారు
పిండిపాలెంలో జోరుగా వేనాటి రామచంద్రారెడ్డి ప్రచారం
సూళ్లూరుపేట మండలంలోని పిండిపాలెంలో మంగళవారం వైకాపా నాయకులు, మాజీ తితిదే పాలక మండలి సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూర్చాయన్నారు. కావున ప్రజలు మళ్లీ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్