ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలో గత నెల 28న వివాదాస్పద భూమిలో జామాయల్ కర్ర తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి అదే భూముల్లో కొంతమంది జామాయిల్ కర్ర తరలిస్తున్నారు సమాచారంతో రెవెన్యూ అధికారులు మంగళవారం రవాణాలను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న కలపను వేలం వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.