ఉదయగిరి మండలం కొరకుల బీసీ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కాలనీలో 15 ఏళ్ల కిందట ఆలయ పనులు చేపట్టారు. అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని కాలనీ వాసుల సంకల్పించారు. ఈ క్రమంలో హోమాలు, పూజలు నిర్వహించారు.