నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పబ్బులేటిపల్లి సచివాలయం పరిధిలో శుక్రవారం ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం జరగనుంది. ఈ వైద్య సేవలను సచివాలయం పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారిని స్వప్న పేర్కొన్నారు. ఉచితంగా వైద్యం చేసి మందులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య బృందం పాల్గొంటారని తెలిపారు.