AP: విద్యా శిక్షణ సంస్థ(డైట్)లలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 13 డైట్లలో బలోపేతం చేయడానికి డిప్యుటేషన్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేపడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 10లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. 2025-26 ఏడాదికి అర్హులైన పాఠశాల సహాయకులు, HM, మండల విద్యా శాఖాధికారుల దరఖాస్తులుచేసుకోవాలని సూచించింది.