మైలవరం నియోజకవర్గంలో వైసిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరపతిరావు కోరారు. శుక్రవారం స్థానిక పెద్ద మసీదులో ముస్లిం సోదరులను అభ్యర్థి తిరుపతిరావు కలిశారు. తన గెలుపుకు కృషి చేయాలని ముస్లింలు సోదరులను కోరారు. అల్లా ఆశీస్సులు తిరుపతిరావు ఉండాలని ప్రార్థన చేశారు. శనివారం అభ్యర్థి నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.