జిల్లా లోని కొన్ని మండలాల్లో ఆరెంజ్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. గురువారం వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా మండలాల్లోని ప్రజానీకం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు, జి కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ, మైలవరం, వీరులపాడు, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.