మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడను: సుజనా

80చూసినవారు
కానూరులో ఎన్డీఏ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నివాసంలో ముస్లిం సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి సుజనా మీడియాతో మాట్లాడారు. మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడనని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో మైనార్టీల ఆస్తులను కాపాడతానన్నారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేసి నిర్దిష్ట కాలంలోనే సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్