చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ

73చూసినవారు
మంగళవారం విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. అది గమనించిన బాబు వెంటనే కాన్వాయ్ ను నిలిపి ఆమెతో మాట్లాడారు. టీడీపీ గెలుపుకోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో ఆయన థాంక్స్ చెప్పారు. 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూసేందుకు వచ్చానని చెప్పగా ఆరోగ్యం చూసుకోవాలని ఆస్పత్రికి వెళ్లాలని బాబు బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్