AP: మంత్రి సంధ్యారాణి మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలకు వన్స్టాప్ సెంటర్ల ద్వారా భరోసా కలుగుతుందని మంత్రి వెల్లడించారు. గురువారం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద వన్స్టాప్ సెంటర్ను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వన్స్టాప్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.