AP: మంత్రి పార్థసారధి నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్ చెప్పారు. అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే నిర్మాణం జరుగుతుందన్నారు. తొలిదశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో పనులు జరుగుతాయన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 55 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా.