ఈ నెల 19 నాటికి పంట నష్టం అంచనా వేస్తాం

85చూసినవారు
పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది రైతుల పంట నష్టం పై పూర్తిస్థాయి నివేదికను సెప్టెంబర్ 19 నాటికి తయారు చేస్తారని శనివారం సహాయ సంచాలకులు మురళి తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టంపై నేరుగా రైతు నుంచి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తరువాత రైతు సేవా కేంద్రాల వద్ద వివరాలు ఉంచడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్