ఇప్పటికయితే రాష్ట్రస్థాయిలో టిడిపి, జనసేనల మధ్య సీట్ల కేటాయింపుపై ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా చీరాల నుండి తాను పోటీ చేసేది ఖాయం అంటూ
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు బహిరంగ ప్రకటనలతో హల్ చల్ చేస్తుండడంపై టిడిపి శ్రేణుల నుండి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఏకపక్షంగా స్వాములుకు చీరాల టిక్కెట్ ఇస్తే సహాయ నిరాకరణకు టిడిపి శ్రేణులు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం.