కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు: ఎమ్మేల్యే

57చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రొంపిచర్ల మండలం మునుమాక, విప్పర్లపల్లి గ్రామాల మధ్య గల చప్టా పూర్తిగా కొట్టుకుపోయింది. నరసరావుపేట నుంచి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై శనివారం స్పందించిన నరసరావుపేట ఎమ్మేల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సంబంధిత అధికారులతో కలిసి చప్టా స్థానంలో బ్రిడ్జి నిర్మించేందుకు అవసరమైన అంచనాలను రూపొందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్