కొన్ని నెలల క్రితం సత్తెనపల్లి పట్టణంలో వీధికో వైసీపీ జండా దిమ్మెలను అనుమతులు లేకుండా, పబ్లిక్ స్థలాల్లో అక్రమంగా నిర్మించారని జనసేన నేత సాంబశివరావు అన్నారు. అనధికారికంగా, అనుమతుల్లేకుండా నిర్మించిన వైసీపీ జండా దిమ్మెలను తక్షణమే చట్టప్రకారం తొలగించాలని ఆయన మున్సిపల్ కమీషనర్ కు మంగళవారం జనసేన తరఫున ఫిర్యాదు చేశారు.