విజయవాడ బయలుదేరిన వినుకొండ పారిశుద్ధ్య కార్మికులు

64చూసినవారు
వినుకొండ పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం విజయవాడ తరలివెళ్లారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరంలో వచ్చిన వరద ప్రాంతంలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ పనులను చేసేందుకు వినుకొండ పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు. వారి వాహనానికి కమిషనర్ సుభాష్ చంద్ర బోస్ జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్