జాతిపిత చిత్రపటానికి సత్కరించిన బొబ్బిలి నూతన ఎక్సైజ్ సిఐ

74చూసినవారు
జాతిపిత చిత్రపటానికి సత్కరించిన బొబ్బిలి నూతన ఎక్సైజ్ సిఐ
మహాత్మా గాంధీ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం బొబ్బిలిలో న్యాయవాదులు బి ఎస్ ఆర్ మూర్తి మరియు తుమరాడ గంగాధర్, ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎక్సైజ్ సిఐ చిన్నం నాయుడు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా, ఈ రోజు నూతన ఎక్సైజ్ సిఐగా బాధ్యతలు స్వీకరించినందున న్యాయవాదులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్