సీజనల్ వ్యాదులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టీ. జగన్మోహన్ రావు ఆదేశించారు. మంగళవారం కొమరాడ మండలం కునేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన సమీక్ష చేశారు. ఏ గ్రామాల్లో సీజనల్ జ్వరాలు నమోదు అవుతున్నాయి, అక్కడ ఏ విధమైన నివారణ చర్యలు చేపడుతున్నారు, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.