గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణే లక్ష్యం

65చూసినవారు
గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణే లక్ష్యం
గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణ లక్ష్యంగా మహిళా సంఘాలు సమావేశాలలో చర్చించాలని ఎంపీడీఓ మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం కొమరాడ వెలుగు కార్యాలయంలో గ్రామ సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తరుచూ వైద్య పరీక్షలు చేయించుకొని, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ఏపీఎం బీ. వెంకటరమణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్