మహిళా చైతన్యంతో అభివృద్ధి: ఎమ్మెల్యే

54చూసినవారు
మహిళలు చైతన్యవంతులైతే ఆ ప్రాంతం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అనుకున్న విధంగా అభివృద్ధి చెందుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పెద్దబండపల్లిలో సాక్షం అంగన్వాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి పిల్లలు రేపటి భావి భారత పౌరులని, వారు మంచి ఆరోగ్యం కలిగి ఉంటే దేశం బాగుంటుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్