దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

72చూసినవారు
పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బుధవారం సచివాలయంలో కలిశారు. నియోజకవర్గంలో బలిజిపేట మండలం నారాయణపురం, గళావిల్లి తోటపల్లి దేవాలయాల పరిస్థితిని మంత్రికి వివరించారు. ఆలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని అలాగే గిరిజన గ్రామంలో టీటీడీ దేవాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే తెలియజేసిన అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్