తైక్వాండో ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన ప్రకాశరావు

80చూసినవారు
తైక్వాండో ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన ప్రకాశరావు
మలేషియాలో ఈ నెల 27, 28, 29 వ తేదీల్లో జరిగిన ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్ లో కొత్తవలస మండలం కంటకాపల్లికి చెందిన ములపర్తి ప్రకాష్ రావు 80 కేజీల విభాగంలో భారతదేశం తరుపున పాల్గొని బంగారు పతకం సాధించినట్లు కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మాకరరావు సోమవారం తెలిపారు. కాగా ప్రకాష్ రావు సింగపూర్, బంగ్లాదేశ్, మలేషియా క్రీడాకారులతో 80 కేజీల విభాగంలో తలపడి సెమీఫైనల్, ఫైనల్ కు చేరుకుని బంగారు పతకం సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్