పవన్ కళ్యాణ్ మోసం చేశారు: జనసేన నేత

8628చూసినవారు
పవన్ కళ్యాణ్ మోసం చేశారు: జనసేన నేత
జగ్గంపేట సీటును ఆశించిన జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్రకు నిరాశే మిగిలింది. దాంతో అతను రోడ్డుపైనే బోరున విలపించాడు. నిన్న రాత్రి నుంచి అచ్చుతాపురంలోని అమ్మవారి ఆలయంలో దీక్ష చేపట్టాడు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు. ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడాను. పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మోసం చేశారు. నా మరణం రాజకీయ పార్టీల్లో మార్పు తేవాలి’ అని అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్