జనసేనాని పవన్ కళ్యాణ్పై జనసేన నేత కొణతాల రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఆశించిన ఫలితాలు రాబోతున్నాయి. పవన్ వ్యక్తిగత స్వార్థం ఉన్న వ్యక్తి కాదు.. నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆలోచించే తాను నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర విభజన సమయంలో కంటే సీఎం జగన్ పాలనలో వంద రేట్లు ఎక్కువ నష్టపోయాం." అని కొణతాల విమర్శించారు.