ఏపీ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన హామీలు ఇచ్చారు. ప.గో. జిల్లా నరసాపురంలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.