మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు

60చూసినవారు
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
AP: మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై టీడీపీ నేత తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌ల‌పై పొన్నవోలు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేశార‌ని గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్